భారతదేశం, జూన్ 2 -- రాష్ట్రంలో వాహనదారులకు రవాణా శాఖ అత్యంత కీలకమైన అప్డేట్ అందించింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే చలాన్ల విధానంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను అమలు చేయనుంది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం డిజిటల్ మాధ్యమాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు ఇకపై నేరుగా వారి మొబైల్ నంబర్లకు షార్ట్ మెసేజింగ్ సర్వీసెస్ (SMS), వాట్సాప్ (WhatsApp) లేదా వారి అధికారిక ఈ-మెయిల్ (e-mail) అడ్రస్‌లకు డిజిటల్ రూపంలో చలాన్ నోటీసులు అందుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని వాహన యజమానులందరూ ఈ నోటిఫికేషన్ విడుదలైన నెల రోజులలోపు తమ ప్రస్తుత మొబైల్ నంబర్,...