భారతదేశం, జూలై 31 -- రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా, ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించే తుది గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు పెంచగా, తాజాగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని దానిని ఆగస్టు 10 వరకు పొడిగించారు.

కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాల ప్రకారం.. బూత్ స్థాయి అధికారులు (BLOలు) నిర్వహించే ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. ఈ పొడిగింపు కారణంగా, ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ తేదీతో పాటు తదుపరి షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం ముసాయిదా ఓట...