భారతదేశం, జూన్ 18 -- Telangana Rythu Bharosa Funds 2026 : అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుత వానాకాలం సాగుకు సంబంధించిన ఈ పెట్టుబడి సాయం నిధులను కేవలం పది రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో పూర్తిగా జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రైతు భరోసా నిధుల విడుదలతో పాటు రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి ఒక ప్రత్యేక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు ప్రాధాన్యత క...