భారతదేశం, సెప్టెంబర్ 14 -- Telangana Rains : భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామున నగరాన్ని జడివాన ముంచెత్తింది. గడచిన రెండు మూడు గంటలుగా నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఉదయాన్నే ఆఫీసులు, పనులకు వెళ్లే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, మణికొండ, షేక్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్, లక్డీకపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్, హయత్‌నగర్ వంటి దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

నగరంలో అత్యధికంగా బేగంపేట ప్రాంతంలో 93 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఈ కింద...