భారతదేశం, మార్చి 26 -- బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ప్రభావంతో తెలంగాణలో గత వారం రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. అయితే మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో (గంటకు 30-40 కి.మీ) కూడిన వర్షాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్...