భారతదేశం, సెప్టెంబర్ 2 -- తెలంగాణ రాష్ట్రంలో 2026 ఆగస్టు నెల నాటికి భూగర్భ జలమట్టాల పరిస్థితులపై భూగర్భ జల వనరుల శాఖ సమగ్ర గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోని అన్ని మండలాలను కవర్ చేస్తూ, మొత్తం 1,771 పిజోమీటర్ల ద్వారా నీటి మట్టాలను నమోదు చేసి పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు.

2026 ఆగస్టు నాటికి తెలంగాణ వ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి 7.87 మీటర్లుగా నమోదయింది. రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఆదిలాబాద్ జిల్లాలో సగటున 3.48 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతుండగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యంత లోతుగా అంటే 12.12 మీటర్ల వద్ద నీటి మట్టం పడిపోయింది.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 23 జిల్లాలలో సగటు నీటిమట్టం 5 నుండి 10 మీటర్ల లోతులో ఉంది. మిగిలిన 10 జిల్లాల్లో భూగర్భ జలాలు 10 నుండి 15 మీట...