భారతదేశం, ఆగస్టు 12 -- బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయడం ఈ పథకం ప్రత్యేకత.

ఆగస్టు 13, 2026 గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని జీ-29లో ఈ పథకం...