భారతదేశం, ఆగస్టు 18 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా జవాబుదారిగా ఉంటుందని, 22A నిషేధిత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు మరియు సబ్ రిజిస్ట్రార్లతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 22A తో ఉత్పన్నమవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

న్యాయబద్ధంగా ఉన్న ప్రైవేటు భ...