భారతదేశం, జూన్ 2 -- CM Revanth Reddy Speech : తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో ఎందరో అమరులయ్యారని, వారి త్యాగాలకు, తెగువకు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ.. రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 అని ఆయన పేర్కొన్నారు.

స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్, నాటి యు.పి.ఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు రాసిన "పుట్టుక నీది... చావు నీది, బతుకంతా దేశ...