భారతదేశం, మే 8 -- Telangana Education Reforms : తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దశాబ్దాలుగా ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ బోర్డు ఉనికిని రద్దు చేసి.... దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి... విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

వాస్తవానికి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఇటీవలనే షెడ్యూల్ విడుదల చేసింది. మే 8 నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఓవైప...