భారతదేశం, మార్చి 9 -- 2027 జనాభా లెక్కల మొదటి దశ కార్యకలాపాలు మే 11న తెలంగాణ అంతటా ప్రారంభమవుతాయి. దేశ చరిత్రలో మొదటిసారిగా మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా మారుతుంది. మీ ఇంటి వద్దకు లెక్కింపు అధికారి వచ్చే వరకు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది. 2027 జనాభా లెక్కింపులో రెండు దశలు ఉంటాయి. మెుదటిది గృహాల జాబితా, రెండోది జనాభా గణన.

జనాభా లెక్కల గురించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మార్చి 3న అన్ని జిల్లా కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి కార్యాచరణ, శిక్షణపై చర్చించారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రతీ జనాభా గణన కాగితం రూపంలోనే ఉంది. కానీ ఈసారి ఫస్ట్ టైమ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా డేటాను పూర్తిగా సేకరిస్తారు. వేగవంతమైన ప్రాసెసింగ్, కచ్చితత్వం, రియల్ టైమ్ డేటా క్యాప్చర్ ఉంటు...