భారతదేశం, ఆగస్టు 8 -- Cheyutha Pension Applications Telangana : రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. చేయూత పథకం కింద నూతన సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను శనివారం(ఆగస్ట్ 8, 2026) నుంచి ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15 నుంచి నూతన పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు.

ముఖ్యంగా ఈ దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి చివరి తేదీ (లాస్ట్ డేట్) లేదని.. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి అర్హులైన ప్రతీ ఒక్కరూ నిశ్చింతగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

సామాజిక భద్రతను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కొన్ని వర్గాలకు ప్రాధాన్య క్రమంలో పింఛ...