భారతదేశం, మార్చి 27 -- టెక్నో సంస్థ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'టెక్నో స్పార్క్ 50 5జీ'ని నేడు భారత మార్కెట్​లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6500ఎంఏహెచ్​ సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 45డబ్ల్యూ వేగవంతమైన ఛార్జింగ్, గూగుల్ పిక్సెల్ ఫోన్లను పోలిన కెమెరా డిజైన్‌తో వస్తోంది. పనితీరుతో పాటు, ఈ రిలీజ్ ద్వారా మన్నిక, నిజ జీవితంలో వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యమని బ్రాండ్ నొక్కి చెబుతోంది. ఏప్రిల్ 3 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్, ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న అత్యంత సరసమైన 5జీ ఆప్షన్లలో ఒకటిగా నిలవనుంది.

డిజైన్ పరంగా చూస్తే, స్పార్క్ 50 5జీ స్మార్ట్​ఫోన్ వెనుక భాగంలో పిక్సెల్ తరహా కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. దీనిని ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఫోన్ లోని మిగిలిన భాగం పాలీకార్బోనేట్‌తో నిర్మించినప్పటికీ, రోజువా...