భారతదేశం, జూలై 25 -- Team India Record: అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో టీమిండియా భారీ స్కోరు సాధించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసింది.

ఇవాళ (జూలై 25) జింబాబ్వేతో రెండో టీ20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్) చెలరేగారు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది.

జింబాబ్వేపై బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత్ ప్రపంచ రికార్డు సమం చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా నిలిచి తన ఆధిపత్యాన్ని చ...