భారతదేశం, మే 9 -- Tata Nexon sunroof variant : భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న టాటా మోటార్స్.. తన బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ 'నెక్సాన్' శ్రేణిని మరింత విస్తరించింది! తాజాగా 'ప్యూర్+ పీఎస్' (Pure+ PS) పేరుతో కొత్త వేరియంట్‌ను మార్కెట్​లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 9.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది.

సాధారణంగా పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఖరీదైన కార్లలో లేదా టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే కనిపిస్తాయి. కానీ, టాటా మోటార్స్ మొదటిసారిగా రూ. 10 లక్షల లోపు ధరలోనే ఈ ఫీచర్‌ను అందించింది.

దేశీయ మార్కెట్​లో నెక్సాన్ ఏకంగా 10 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించిన తరుణంలో, కస్టమర్లకు కానుకగా ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది.

వివిధ ఇంధన ఆప్షన్లలో లభించే ఈ వేరియంట్ ధరలు ఇలా ఉన...