భారతదేశం, మార్చి 29 -- తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం సిద్ధమవుతున్న టీవీకే పార్టీ. తాజాగా 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ వివరాలను ఆ పార్టీ అధినేత విజయ్ వెల్లడించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.చెన్నైలో ఆదివారం జరిగిన సభలో విజయ్‌. ఈ జాబితాను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తమకు, డీంకే మధ్యే అసలైన పోటీ ఉందని వ్యాఖ్యానించారు.

పెరంబూర్ నియోజకవర్గం నుంచి డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డీ శేఖర్ పై విజయ్ పోటీ చేయనున్నారు. తిరుచ్చి ఈస్ట్ లో చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే, డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ పై బరిలో ఉంటారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. విశ్వాసంతో, నిజాయితీగా, ప్రజాసేవకు అంకితభావంతో ఉంటామని చెప్పారు. ర...