భారతదేశం, ఫిబ్రవరి 25 -- టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లో ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న ఇండియాకు మరింత షాకిచ్చే వార్త ఇది. టీమ్ కష్టాలు డబుల్ చేస్తూ డేంజరస్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడాడు. ఈ స్టార్ బ్యాటర్ చెన్నై నుంచి డైరెక్ట్ గా యూపీ వెళ్లిపోయాడు. గురువారం జింబాబ్వేతో మ్యాచ్ లో అతను ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

భారత జట్టు మిడిల్-ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నైలో టీమ్ తో ఉన్న అతను హుటాహుటిన యూపీ బయల్దేరాడు. రింకు సింగ్ తండ్రి ఖాంచంద్ సింగ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడమే ఇందుకు కారణం. ఫోర్త్ స్టేజీ క్యాన్సర్ తో పోరాడుతున్న రింకు సింగ్ తండ్రి ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలిసింది.

క్యాన్సర్ తో పోరాడుతున్న తండ్రి పరిస్థితి అత్యంత స...