భారతదేశం, జూన్ 14 -- Sushant Singh Rajput: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఈ లోకాన్ని వీడి ఆరు సంవత్సరాలు అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సుశాంత్ సింగ్ ఆరేళ్ల క్రితం 2020, జూన్ 14న కన్నుమూశారు. ఆయన మరణం అప్పట్లో కలకలం రేగింది. మొత్తం సినీ ఇండస్ట్రీనే కదిలించింది. సుశాంత్ ఆరో వర్థంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం కొన్ని ఏఐ (AI) ఫోటోలు, పాత మధుర స్మృతులను పంచుకుంటూ శ్వేతా సింగ్ రాసిన వ్యాఖ్యలు అభిమానుల కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి నెపోటిజం రచ్చ మొదలైంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్వేతా సింగ్ పెట్టిన పోస్ట్ కేవలం ఒక సోదరి ఆవేదన మాత్రమే కాదు, సుశాంత్ అనే బ్రాండ్ ఇప్పటికీ ప్రజల హ...