భారతదేశం, జూన్ 1 -- Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మే 15, 2026న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'కరుప్పు' సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం తమిళనాడులోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా సూర్యకు ఉన్న భారీ క్రేజ్ వల్ల ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది.

కరుప్పు సినిమా సాధించిన అపూర...