భారతదేశం, మే 14 -- గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. మే 15, అనగా రేపు సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. మే 15 నుంచి జూన్ 15 దాకా సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

2026 మే నెలలో జరిగే ఈ మార్పు చాలా కీలకమైనది. సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు; ఆత్మకు, ఆత్మవిశ్వాసానికి, తండ్రికి, అధికారానికి కారకుడు. నెలరోజుల పాటు సూర్య సంచారం కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో చాలామంది జీవితాల్లో ఆకస్మిక మార్పులను చూస్తారు. ఆర్థిక లాభాలు, ఉద్యోగ మార్పులు, మానసిక ఒత్తిడి ఇలా రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రత్యేక గ్రహగమనం 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సూర్...