భారతదేశం, జూన్ 19 -- జూన్ 22న సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని వదిలి, రాహువుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి అడుగుపెడతాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆరుద్ర అంటే 'తడిసిన' అని అర్థం. అంటే భూమి తన గర్భంలో విత్తనాన్ని మోయడానికి సిద్ధమైందని దీని సంకేతం. ఈ సమయంలో సూర్యుడి తీవ్రత తగ్గి, వాతావరణంలో చల్లదనం మొదలవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్నే 'ఆరుద్ర కార్తీ'గా పిలుస్తారు. వ్యవసాయానికి ఇది అత్యంత కీలకమైన సమయం.

మత్స్య పురాణం ప్రకారం, ఆరుద్ర ప్రవేశం సమయంలో భూమి రజస్వల అవుతుంది. అంటే, భూమిలో విత్తనాలు నాటడానికి, సాగు పనులకు ఇది అత్యంత అనువైన సమయం. ఈ సమయంలో సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, జీవితంలో ప్రతికూలతలు తొలగిపోయి సానుకూల మార్పులు వస్తాయని విశ్వాసం.

ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడితో పాటు ఇంద్రుడిని పూజించడం వెనుక బలమైన క...