భారతదేశం, మార్చి 6 -- భారత వైమానిక రక్షణ రంగంలో విషాదం చోటుచేసుకుంది. అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఐఏఎఫ్​కి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కుప్పకూలిందని అధికారులు శుక్రవారం ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

గురువారం సాయంత్రం అసోంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కనిపించకుండా పోయింది. గాలింపు చర్యల అనంతరం ప్రమాద వివరాలు వెలుగులోకి వచ్చాయి.

జోర్హాట్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా బయలుదేరిన ఈ ఫైటర్ జెట్, రాత్రి 7:42 గంటల సమయంలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత రాడార్ నుంచి అదృశ్యమవడంతో వైమానిక దళం తక్షణమే గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించింది.

ఈ ప్రమాదంలో విమానంలో ఉన...