భారతదేశం, జూన్ 30 -- Sudha Kongara: కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని వివాదం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర తన రెమ్యూనరేషన్ బకాయిల కోసం మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కారు. సంక్రాంతి 2026 సీజన్‌లో రిలీజైన 'పరాశక్తి' సినిమా రైటింగ్, డైరెక్షన్ బాధ్యతలకు గానూ తనకు రావాల్సిన రూ. 8.39 కోట్ల పేమెంట్స్ నిలిచిపోయాయంటూ ఆమె న్యాయ పోరాటానికి దిగారు.

సుధా కొంగర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సంచలన మధ్యంతర ఉత్తర్వులు పాస్ చేసింది. ఈ సినిమాలో లీడ్ ప్రొడ్యూసర్ అయిన ఆకాష్ భాస్కరన్‌తో పాటు అతని బ్యానర్ 'డాన్ పిక్చర్స్' పార్ట్‌నర్లపై కోర్టు సీరియస్ అయింది.

జులై 8 వరకు 'పరాశక్తి' సినిమా శాటిలైట్ టెలివిజన్ రిలీజ్, దానికి సంబంధించిన ఎలాంటి కమర్షియల్ డీల్స్ చేయకూడదంటూ ప్రొడ్యూసర్లను కోర్ట...