భారతదేశం, సెప్టెంబర్ 3 -- గుంటూరు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాత్రివేళల్లో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని మెుదలుపెట్టారు. దీనిద్వారా డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారని, తద్వారా ప్రమాదాలు జరగవని భావిస్తున్నారు.

గుంటూరు పోలీస్ సూపరింటెండెంట్ వాకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, వాహనదారుల భద్రత కోసం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష పహారా, వాహన తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు టోల్‌గేట్, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైవే పెట్రోల్ బృందాలు రాత్రి నుండి తెల్లవారుజాము వరకు నిరంతరంగా గస్తీ నిర్వహిస్తూ వాహనాలను తని...