భారతదేశం, మార్చి 20 -- ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య యుద్ధం మరింత ముదరడం, ప్రపంచ ఎనర్జీ మార్కెట్​ తీవ్ర అనిశ్చితిలోకి జారుకోవడం వంటి కారణాలతో గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ ఏకంగా​ 2497 పాయింట్లు పడి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 776 పాయింట్లు కోల్పోయి 23,002 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1875 పాయింట్లు పడి 53,451 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,558.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,863.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"ని...