భారతదేశం, మార్చి 27 -- శ్రీరామ నవమి నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లకు గురువారం సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1205 పాయింట్లు పెరిగి 75,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 394 పాయింట్లు వృద్ధిచెంది 23,306 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1102 పాయింట్లు పెరిగి 53,708 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,805.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,429.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్ భారీ​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 23,400- 23,600 లెవల్స్​ వద్ద బలమైన రెసిస్ట...