భారతదేశం, మే 5 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 356 పాయింట్లు పెరిగి 77,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 122 పాయింట్లు వృద్ధిచెంది 24,119 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 54,878 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,835.62 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,764.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 డైలీ చార్ట్​లో పెద్ద అప్పర్​ షాడోతో కూడిన స్మాల్​ బుల్లిష్​ క్యాండిల్​ ఏర్పడింది. టెక్నికల్​గా చూసుకుంటే సూచీ 23,800- 24,300 లెవల్...