భారతదేశం, ఏప్రిల్ 6 -- గుడ్​ ఫ్రైడే నేపథ్యంలో శుక్రవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 185 పాయింట్లు పెరిగి 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు వృద్ధిచెంది 22,713 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 51,549 వద్దకు చేరింది.

ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్​ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లో తీవ్ర అస్థిరత నెలకొంది. దీనికి ముగింపు ఎప్పుడు పడుతుంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేకపోవడంతో సూచీల్లో ఒత్తిడి కనిపిస్తోంది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,931.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,208.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

PPF : మెచ్యూరిటీ ...