భారతదేశం, మే 12 -- Gift nifty live : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1313 పాయింట్లు పడి 76,015 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 871 పాయింట్లు పడి 54,440 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,438 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,940 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 190 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 డైలీ చార్ట్​లో గ్యాప్​ డౌన్​ ఓపెనింగ్​తో కూడిన భారీ బేర్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది నెగిటివ్​ ట్రెండ్​కి సంకేతం. సూచీ ఇప...