భారతదేశం, ఏప్రిల్ 17 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 123 పాయింట్లు పడి 77,989 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 35 పాయింట్లు కోల్పోయి 24,197 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 216 పాయింట్లు పడి 56,086 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 382 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3428 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"టెక్నికల్​గా నిఫ్టీ50కి 24,415 వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉంది. రానున్న 1-2 రోజుల్లో సూచీ స్వల్పంగా కరెక్ట్​ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ50కి 24,100- 24,...