భారతదేశం, మార్చి 24 -- ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య ఉద్రిక్తతల వేళ సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1,837 పాయింట్లు పడి 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 602 పాయింట్లు కోల్పోయి 22,513 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1989 పాయింట్లు పడి 51,438 వద్దకు చేరింది.

అయితే, మార్కెట్​లు ముగిసిన తర్వాత, ఇరాన్​తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించడంతో యుద్ధం ముగింపుపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు మొదలయ్యాయి. ఇది ప్రపంచ స్టాక్​ మార్కెట్​లకు అత్యంత సానుకూలంగా మారింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,665.00 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,353.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవార...