భారతదేశం, జూలై 2 -- Star Maa Serials: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లే స్టార్ మా ఛానెల్.. ఇప్పుడు మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్ పేరు 'ఏ దేవి వరమో నీవు'. వచ్చే సోమవారం అంటే జులై 6 నుంచి ఈ సీరియల్ ప్రారంభం కానుంది.

స్టార్ మా ఛానెల్ చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు. పుట్టగానే తల్లికి దూరమైన ఓ కూతురు 25 ఏళ్ల తర్వాత మళ్లీ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్తే ఏం జరుగుతుంది అన్న ఆసక్తికర కథతో ఈ సీరియల్ రాబోతోంది.

ఈ సరికొత్త సీరియల్ ను వచ్చే సోమవారం అంటే జులై 6 నుంచి రాత్రి 8.30 గంటలకు స్టార్ మా టెలికాస్ట్ చేయబోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది.

స్టార్ మా ఛానెల్ గత కొన్నాళ్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ప్రమోషనల్ వీడియోలు, ఇతర కంటెంట్ చూస్తే.. అ...