భారతదేశం, జూలై 19 -- Srisailam VIP Break Darshan : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో కీలక మార్పులు చేసినట్లు దేవస్థానం ఛైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో సంయుక్తంగా తెలిపారు. వారాంతాల్లో క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా. రద్దీని క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.

వారాంతాల్లో శ్రీశైలానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, అందరికీ స్వామివారి దర్శనం సజావుగా సాగేలా చూసేందుకే ఈ మార్పులు చేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ మార్పులతో సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కొత్త విధానాలను భక్తులు గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ ...