భారతదేశం, సెప్టెంబర్ 5 -- Srisailam Dam Water Level Updates : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి రాక స్వల్పంగా కొనసాగుతోంది. ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన నేటి ఉదయం నివేదిక ప్రకారం.. డ్యామ్‌లోకి ఇన్ ఫ్లో (వరద ప్రవాహం) 2,815 క్యూసెక్కులుగా నమోదైంది. అదే సమయంలో రిజర్వాయర్ నుంచి దిగువకు 49,090 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 869.501 అడుగులకు చేరింది. వరద ప్రవాహాలు మందగించడం, నీటి వినియోగం క్రమబద్ధీకరించడం వల్ల ప్రాజెక్టు పరిధిలోని కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. నాగార్జునసాగర్ దిగువ అవసరాలకు అనుగుణంగా ఔట్ ఫ్లో విడుదల కొనసాగుతోంది.

కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఎగువ రాష్...