భారతదేశం, ఏప్రిల్ 17 -- ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లే భక్తులకు ధర్మకర్తల మండలి శుభవార్త చెప్పింది. రాహు-కేతు సర్పదోష నివారణ పూజల్లో కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యార్థం పూజా విధానాలతో పాటు రుసుముల్లో పలు మార్పులు చేసేందుకు ధర్మకర్తల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గురువారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ట్రస్టు బోర్డు సమావేశం జరిగింది. మొత్తం 21 అంశాలపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎంతో ఖరీదైన రాహు-కేతు పూజలను సామాన్య భక్తులకు తక్కువ ధరలోకే అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తొలి ప్రాధాన్యంగా శ్రీకాళహస్తీ నియోజకవర్గ పరిధిలోని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా రూ.100 కే రాహు-కేతు సర్పదోష నివార...