భారతదేశం, ఏప్రిల్ 10 -- Srikakulam - Tirupati Humsafar Express Train : ఉత్తరాంధ్ర వాసులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. తిరుపతి - శ్రీకాకుళం రోడ్ - తిరుపతి మధ్య హంసఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 17439 / 17440) పట్టాలెక్కనుంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ గా ప్రయాణించే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ఏప్రిల్ 13వ తేదీన ప్రారంభం కానుంది.

ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడం వల్ల తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఉత్తరాంధ్ర భక్తులతో పాటు. పలు పనుల నిమిత్తం ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.రెండు రైళ్లు మారాల్సిన ఇబ్బందులు లేకుండానే. ఇక నేరుగా తిరుపతికి చేరుకోవచ్చు.

తిరుపతి నుంచి ఆదివారం సాయంత్రం 16.55 గంటలకు బయలుదేరే రైలు.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటు...