భారతదేశం, సెప్టెంబర్ 4 -- భారతీయ సనాతన ధర్మంలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న పర్వదినాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే ఈ పవిత్ర దినాన పరమాత్ముడు భువిపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో మధురను భోజవంశ రాజు ఉగ్రసేనుడు పాలించేవాడు. అయితే ఆయన కుమారుడైన క్రూరుడు కంసుడు తండ్రిని గద్దె దించి రాజ్యాధికారాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు.

కంసుడికి చెల్లెలైన దేవకి వివాహం యాదవ వంశానికి చెందిన వసుదేవుడితో అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధువును అత్తగారింటికి సాగనంపుతున్న తరుణంలో ఆకాశం నుంచి ఒక అశరీరవాణి పలికింది. "ఓ కంసా! ఎవరినైతే నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావో, అదే చెల్లెలి గర్భాన పుట్టే ఆరవ లేదా ఎనిమిదవ సంతానం నీ ప్రాణాలను హరిస్తుంది" అని హెచ్చరించింది.

ఆకాశవాణి హెచ్చరికతో నివ్వెరపోయిన కంసుడు వెంటనే బావమరిది వసుదేవుడిని చంప...