భారతదేశం, జూన్ 13 -- South Central Railway Freight Network : దక్షిణ మధ్య రైల్వే (SCR) తన సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ, సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. రైల్వే నెట్‌వర్క్ ద్వారా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను వేగవంతం చేయడానికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి, జానకంపేట రైల్వే స్టేషన్ల నుంచి సరికొత్త వస్తువుల లోడింగ్‌ను రైల్వే శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఈ సరికొత్త చొరవ అటు పారిశ్రామికవేత్తలకు, ఇటు రైతులకు ఎంతగానో లబ్ధి చేకూర్చనుంది.

కర్నూలు జిల్లా పరిధిలోని వెల్దుర్తి రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రత్యేకమైన కంటైనర్ టెర్మినల్‌ను (ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ చరిత్రలోనే తొలిసారిగా. స్థానిక ఉక్కు కర్మాగారంలో తయారైన పిగ్ ఐరన్, టీఎంటీ స్టీల్...