భారతదేశం, ఏప్రిల్ 8 -- బెంగాలీ బుల్లితెర నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మరణం ఆ చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఒడిశాలో 'భోలేబాబా పార్ కరేగా' సీరియల్ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. "అసలు షూటింగ్ కోసమని నీటిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.

సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలపై ప్రముఖ నటి స్వస్తిక ముఖర్జీ తీవ్రంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో స్వస్తిక ముఖర్జీ మాట్లాడుతూ.. "గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి తన నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో గమనించుకోవాలి. ఆయన మాటలు ఎదుటివారి వృత్తిని కించపరిచేలా ఉన్నాయి. మీరు చేస్తున్న పనిని నేను తక్కువ చేసి మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంద...