భారతదేశం, జూలై 11 -- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు చివరి దశకు చేరుకుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 99 శాతం ఫారాల పంపిణీ పూర్తయినట్లు ఆయన ప్రకటించారు.

ఈ ప్రక్రియ పురోగతిపై సుదర్శన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా సాగుతోందని.. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) విస్తృతంగా పర్యటిస్తున్నారని చెప్పారు. ప్రజల ఇళ్ల వద్దకే ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, ప్రజలు వీటిని నింపి వీలైనంత త్వరగా బీఎల్ఓలకు సమర్పించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో ఓటర్లు తమ వివరాలను పూరించి,...