భారతదేశం, జూలై 15 -- తెలంగాణలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) గడువును పొడిగించింది.

కొత్త(సవరించిన) షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLO) చేపట్టే ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3, 2026 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో. క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఈ సవరించిన షెడ్యూల్ సమాచారం.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ సంబంధిత అధికా...