భారతదేశం, జూలై 25 -- SIR Process in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తయింది. ఈ ప్రక్రియకు సంబంధించి డిజిటలైజేషన్ పనులన్నింటినీ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి చేశారు. ఈ సవరణల ఆధారంగా రూపొందించే కొత్త ఓటర్ల జాబితా విడుదలపై ఎన్నికల సంఘం పలు వివరాలను వెల్లడించింది.

ఏపీలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 44,71,523 మందిని 'అన్‌కలెక్టబుల్' ఓటర్లుగా అధికారులు గుర్తించారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చిరునామా మారడం లేదా మరణించడం వంటి వివిధ సాంకేతిక, క్షేత్రస్థాయి కారణాలతో వీరిని ఈ జాబితాలో చేర్చారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యతో పోల్చి చూస్తే.. ఈ అన్‌కలెక్టబుల్ ఓటర్ల శాతం ఏకంగా 10.74 శాతంగా నమోదుగా ఉంది. వీటిలో అత్యధిక వాటా మరణించిన ఓటర్లదే. వీరి సంఖ్య 15,19,558 (3.65శాతం)గా గుర్తి...