భారతదేశం, జూన్ 26 -- దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది. విపక్షాలు, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసిన ఈ ప్రక్రియకు సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ డ్రైవ్ దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది.

గతేడాది జూన్ 24న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎస్ఐఆర్ (SIR) పైలట్ ప్రాజెక్ట్‌ను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఆ తర్వాత నిర్వహించిన ప్రక్షాళనలో బీహార్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది పేర్లను తొలగించారు. ...