భారతదేశం, ఏప్రిల్ 11 -- తనను సుభా సియపోగు అనే న్యాయవాది వేధిస్తున్నానంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని పేర్కొన్నారు. రూ. 150 కోట్ల మోసం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.

న్యాయవాది సుభా సియపోగు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ. 150 కోట్లు మోసం చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా. కావాలనే తన పేరును ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.

కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా. తనను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం కూడ...