భారతదేశం, జూన్ 12 -- Singareni Medical Board 2026 : సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సంస్థలో వివిధ సాంకేతిక, ఇతర కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డు ప్రక్రియను అతి త్వరలోనే యథావిధిగా ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల సుదీర్ఘ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలన్నారు.

ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత శాసనసభ్యులు, మంత్రులతో సింగరేణి అభివృద్ధిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. బోర్డు న...