భారతదేశం, జూన్ 12 -- Sing Geetham Twitter Review: కొన్ని సినిమాలు కళ్లకు నచ్చుతాయి. కొన్ని మాత్రం మనసుకు నచ్చుతాయి. ఇంకొన్ని అయితే మనతో పాటే థియేటర్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ రిలీజైన 'సింగ్ గీతం' మూవీ కూడా మనతో పాటే ట్రావెల్ చేసే సినిమా అనే కామెంట్లు వస్తున్నాయి. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాస రావు తీసిన మాస్టర్ పీస్ ఇదని నెటిజన్లు ఎక్స్ లో రాసుకొస్తున్నారు.

డిఫరెంట్ పేరుతోనే, తన నేమ్ తోనే మూవీ అర్థం వచ్చేలా సింగీతం శ్రీనివాసరావు తీసిన మూవీ 'సింగ్ గీతం'. ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాపులర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్ గా మారాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

'సింగ్ గీతం' మూవీని మాస్టర్ పీస్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. ''94 ఏళ్...