భారతదేశం, ఏప్రిల్ 19 -- Simhachalam Chandanotsavam 2026 : విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి వారి చందనోత్సవానికి సర్వం సిద్ధమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 20వ తేదీన స్వామి వారు భక్తులకు నిజరూపంలో దర్శనమివ్వనున్నారు.

ఏడాది పొడవునా సుమారు 500 కిలోల చందన లేపనంలో ఒదిగి ఉండే సింహాద్రి అప్పన్న, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి తన అసలు రూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరానున్నారు.

సింహాద్రి అప్పన్న స్వామి వారిని ఏడాది పొడవునా చందన ముద్దతో కప్పబడిన లింగ రూపంలోనే భక్తులు దర్శించుకుంటారు. అయితే అక్షయ తృతీయ నాడు నిర్వహించే చందనోత్సవం అత్యంత విశ...