భారతదేశం, ఏప్రిల్ 16 -- Simhachalam Chandanotsavam: విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తొచ్చే ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలం. ఇక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం దేశంలోని అత్యంత పురాతన, విశిష్టమైన ఆలయాల్లో ఒకటి. మన రాష్ట్రంలోని భక్తులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు "సింహాద్రి అప్పన్న"ను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. అయితే, ఈ ఆలయంలో జరిగే 'చందనోత్సవం' అత్యంత అరుదైనది. ఏడాది పొడవునా గంధపు లేపనంలో దాగి ఉండే స్వామి వారు, కేవలం ఒక్క రోజు మాత్రమే తన నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు.

సింహాచల క్షేత్ర (Simhachalam Chandanotsavam) ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. హిరణ్యాక్షుడు భూమిని చుట్టి సముద్ర గర్భంలో దాచినప్పుడు, మహావిష్ణువు వరాహ అవతారమెత్తి అతడిని సంహరించాడు. ఆ తర్వాత తన సోదరుడి మరణానికి ప్ర...