భారతదేశం, ఏప్రిల్ 19 -- Shruti Haasan: ముంబైలోని ఒక రెస్టారెంట్ నుంచి శ్రుతి హాసన్ బయటకు వస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఆమెను క్లిక్ మనిపించేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను ఉద్దేశించి "మమ్మా" అని పిలిచారు. ఆ పిలుపు వినగానే శృతి ఒక్కసారిగా ఆగిపోయి, తీవ్రమైన కోపానికి గురైంది.

ఫొటోగ్రాఫర్ పై శ్రుతి హాసన్ ఫైర్ అయింది. ఆ వ్యక్తి వైపు తిరిగి.. "ఎవరు మమ్మా? మీ అమ్మనా నేను? ఏం మాట్లాడుతున్నావు అసలు?" అని హిందీలో (కౌన్ హై మమ్మ? ఆప్కీ మమ్మ హై? క్యా బాత్ కర్ రహే హో తుమ్?) అని శ్రుతి ఘాటుగా సమాధానమిచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు శ్రుతి స్పందన సరైనదే అని సమర్థిస్తుంటే, మరికొందరు ఆమె అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.

మెజారిటీ నెటిజ...