భారతదేశం, జూలై 5 -- Ye Devi Varamo Neevu Serial Premiere Launch Event: బుల్లితెరపై సరికొత్త ఎమోషనల్ జర్నీ షురూ కాబోతోంది. విభిన్నమైన కథాంశాలతో తెలుగు ఇళ్లల్లో ఒకరిగా కలిసిపోయిన 'స్టార్ మా' ఛానెల్.. ఇప్పుడు మరో పవర్ ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.

'ఏ దేవి వరమో నీవు' పేరుతో వస్తున్న ఈ సరికొత్త సీరియల్ జూలై 6 నుంచి రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్స్‌లో ఏ దేవి వరమో నీవు సీరియల్ గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్‌ను ఎంతో కోలాహలంగా నిర్వహించారు.

సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు అమ్మ-కూతుళ్ల సెంటిమెంట్, కుటుంబ బంధాల నేపథ్యంలో వచ్చే సీరియల్స్ అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌తో టీఆర్‌పీ రేటింగుల్లో దూసుకుపోతున్న స్టార్ మా.. ఈ కొత్త కథతో ...